విద్యార్థినులతో వ్యక్తిగతంగా మాట్లాడవద్దు
ABN , Publish Date - Oct 08 , 2024 | 12:08 AM
ఉపాధ్యాయులు విద్యార్థినులతో వ్యక్తిగతంగా మాట్లాడవద్దని డీఈవో వాసుదేవరావు సూచించారు.
దివాన్చెరువు, అక్టోబరు 7 : ఉపాధ్యాయులు విద్యార్థినులతో వ్యక్తిగతంగా మాట్లాడవద్దని డీఈవో వాసుదేవరావు సూచించారు. దివాన్చెరువులోని ఒక ప్రైవేటు కార్యక్ర మంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థినులకు ఉపాధ్యాయులకు మధ్య 5-6 అడుగులు దూరం పాటించి విద్యాబోధన చేయాలన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలో మెరుగైన ఫలితాలు సాఽధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. వార్షిక విద్యాకాలెండర్ ప్రకారం సిలబస్ పూర్తిచేసే విధంగా చర్యలు చేట్టామన్నారు. అన్నితరగతుల్లోనూ విద్యార్థులు అభ్యాసనాసామర్థ్యాలు వారి స్థాయికి తగిన విధంగా ఉండేలా ప్రాథమికస్థాయి నుంచి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా అన్ని పాఠశాలలకు సబ్జెక్టు ఉపాధ్యాయులును కేటాయించామని తెలిపారు.