Share News

మైనార్టీలకు ఇచ్చే గౌరవమిదేనా?

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:11 AM

పిఠాపురం, మార్చి 5: తనను వేదికకు పైకి ఆహ్వానించకపోవడంపై డీసీసీబీ డైరెక్టర్‌ సయ్యద్‌ మొహిద్దీన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. గొల్లప్రోలు పట్టణంలోని ఒక పంక్షన్‌హాలులో మంగళవారం నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గ స్థాయి వైసీపీ పోలింగ్‌బూత్‌ కన్వీనర్ల స

మైనార్టీలకు ఇచ్చే గౌరవమిదేనా?
వేదికపైకి ఆహ్వానించకపోవడాన్ని ప్రశ్నిస్తున్న మొహిద్దీన్‌

ప్రశ్నించిన డీసీసీబీ డైరెక్టరు మొహిద్దీన్‌

పిఠాపురం, మార్చి 5: తనను వేదికకు పైకి ఆహ్వానించకపోవడంపై డీసీసీబీ డైరెక్టర్‌ సయ్యద్‌ మొహిద్దీన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. గొల్లప్రోలు పట్టణంలోని ఒక పంక్షన్‌హాలులో మంగళవారం నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గ స్థాయి వైసీపీ పోలింగ్‌బూత్‌ కన్వీనర్ల సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చలమలశెట్టి సునీల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజ రు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో గీత, సునీల్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని, ప్రతి ఇంటికి ప్రభుత్వం అమలు చే సిన సంక్షేమ పథకాలపై వారికి వివరించాలని సూచించారు.

Updated Date - Mar 06 , 2024 | 12:11 AM