నిరంకుశ వైసీపీ పాలనకు గుణపాఠం చెప్పాలి
ABN , Publish Date - Mar 27 , 2024 | 11:37 PM
కాకినాడ సిటీ, మార్చి 27: మతోన్మాద బీజేపీతోపాటు పొత్తు పెట్టుకున్న పార్టీలకు, నిరంకుశ వైసీపీ పాలనకు గుణపాఠం చెప్పాలని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇం డియా కూటమిని గెలిపించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు రావుల వెంకయ్య అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని, విభజన హామీలు ఏ ఒక్కటి అమలు చేయని బీజేపీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. సాంబమూర్తినగర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ పీఆర్ భవన్లో బుధవారం సీపీఐ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రా
![నిరంకుశ వైసీపీ పాలనకు గుణపాఠం చెప్పాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు రావుల
కాకినాడ సిటీ, మార్చి 27: మతోన్మాద బీజేపీతోపాటు పొత్తు పెట్టుకున్న పార్టీలకు, నిరంకుశ వైసీపీ పాలనకు గుణపాఠం చెప్పాలని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇం డియా కూటమిని గెలిపించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు రావుల వెంకయ్య అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని, విభజన హామీలు ఏ ఒక్కటి అమలు చేయని బీజేపీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. సాంబమూర్తినగర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ పీఆర్ భవన్లో బుధవారం సీపీఐ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రావుల వెంకయ్య మాట్లాడుతూ దేశంలో మతోన్మాదం పేట్రేగిపోతోం దన్నారు. రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవాలటే బీజేపీని ఓడించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనకు తాళికట్టి వైసీపీతో కాపురం చేస్తున్నట్టుగా బీజేపీ వైఖరి ఉందన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ పాల్గొన్నారు.