Share News

సమన్వయంతో పని చేస్తే విజయం మనదే

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:48 AM

సమన్వయంతో పనిచేస్తే పార్టీ ఘనవిజయం తద్యమని రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.

సమన్వయంతో పని చేస్తే విజయం మనదే

రాష్ట్ర ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు

తునిరూరల్‌, ఏప్రిల్‌ 2: సమన్వయంతో పనిచేస్తే పార్టీ ఘనవిజయం తద్యమని రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. పేదల అభ్యున్నతి లక్ష్యంగా కూటమి పార్టీలు రూపొందించిన సూపర్‌సిక్స్‌ పథకాలు అన్నివర్గాల్లో వెలుగులు నింపుతాయన్నారు. తుని పట్నం వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్దఎత్తున చేరిన కార్యకర్తలకు ఆయన పార్టీకండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో తుని పట్టణ టీడీపీ అధ్యక్షుడు యినిగంటి సత్యనారాయణ, కుసుమంచి సత్యనారాయణ, కుక్కడుపు బాలాజీ, దంతులూరి శ్రీనివాసరాజు, వెంకటేష్‌ ఉన్నారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు

కాకినాడ సిటీ : గత ఐదేళ్ల కాలంగా కాకినాడ నగరంలో కొన సాగుతున్న అవినీతి, దోపిడీ, భూకబ్జా, గూండాల పాలనతో విసిగి చెందిన నగర ప్రజలతోపాటు వైసీపీకి చెందిన అనేక మంది టీడీపీలో చేరుతున్నారని కాకినాడ సిటీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక జగన్నాధపురంలోని కొండబాబు నివాసంవద్ద ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో వైసీపీకి చెందిన బొడ్డిపల్లి నాని, బొందాడ లక్ష్మి, పెమ్మాడి నాగూర్‌, నీలాపు శశిభూషణ్‌ రెడ్డి పెద్ద సంఖ్యలో వారి అనుచరులతో టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలువేసి టీడీపీలోకి ఆహ్వాని ంచారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో గల కాకినాడ నగరం పేరును వైసీపీ పాలకులు చెడదీసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు.

టీడీపీలో చేరిన వైసీపీ సోషల్‌ మీడియా కో కన్వీనర్‌

ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం మండలం వైసీసీ సోషల్‌ మీడియా కో కన్వీనర్‌ సుందరవేణి సూర్యప్రకాష్‌ సోషల్‌ మీడియా పదవికి రాజీనామా చేశారు. వలంటరీ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి మంగళవారం ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జ్‌ వరుపుల సత్యప్రభ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ వైసీపీ సోషల్‌ మీడియాలో పనిచేసిన సూర్యప్రకాష్‌ టీడీపీలో జాయిన్‌ కావడంతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండల మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు తదితరులు ఉన్నారు. చింతలూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జింకల ఫకీర్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రత్తిపాడు విచ్చేసి సత్యప్రభ రాజాకు మద్దతు తెలిపారు.

50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక

శంఖవరం: శంఖవరం గ్రామంలో వైసీపీకి చెందిన 50 కుటుంభాలు టీడీపీ పార్టీలో చేరారు. టీడీపీ సినీయర్‌ నేత పర్వత సురేష్‌ ఆధ్వర్యంలో వార్డుమెంబర్‌ తంగేళ్ల సోమరాజు, కటారి రాముడు, బద్దేటీ రాజులుతో సహా 50 కుటుంబాలు ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షు డు బద్దిరామారావు, టీఎన్‌యుసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెన్నాశివ, తెలుగు యువత అధ్యక్షుడు కిర్తి సుభాష్‌, బుర్రా ప్రసాద్‌, టీడీపీ, బీజేసీ, జనసేన నాయుకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:49 AM