Share News

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేకహోదా

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:47 AM

ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా వస్తుందని, తద్వారా పరిశ్ర మల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రానికి ఆదా యం వస్తుందని పీసీసీ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు జంగా గౌతమ్‌ తెలిపారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేకహోదా

పి.గన్నవరం, ఏప్రిల్‌ 2: ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా వస్తుందని, తద్వారా పరిశ్ర మల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రానికి ఆదా యం వస్తుందని పీసీసీ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు జంగా గౌతమ్‌ తెలిపారు. లంకలగన్నవరంలో నియోజకవర్గ కన్వీనర్‌ వంటెద్దు బాబి అధ్యక్షతన జరిగిన పార్టీ బీఎల్‌వోల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం రూ.12లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించిన సీఎం జగన్‌కు ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోయారన్నారు. దేశంలో రైతుల పరిస్ధితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. దోపిడీ ప్రభుత్వాలను సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పిసీపీ జనరల్‌ సెక్రటరి మాచవరపు శివన్నారాయణ, చిట్టాల రామజోగేశ్వరావు, నెల్లి వెంకటరమణ, వడ్డి నాగేశ్వరావు, అప్పన శ్రీరామమూర్తి, ములపర్తి మోహనరావు, నీతిపూడి బాలసత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:47 AM