Share News

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:23 AM

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన షెడ్యూల్‌ ఖరారయింది. ఆయన వివిధ ప్రాంతా ల్లో జరిగే బహిరంగసభల్లో పాల్గొంటారు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో   పవన్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

పిఠాపురం, ఏప్రిల్‌ 18: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన షెడ్యూల్‌ ఖరారయింది. ఆయన వివిధ ప్రాంతా ల్లో జరిగే బహిరంగసభల్లో పాల్గొంటారు. 20వ తేదీన పిఠాపురంలో టీడీపీ నేతలతో జరిగే సమావేశానికి హాజరై అనంతరం రాజానగరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 23న పిఠాపురంలో నామినేషన్‌, సాయంత్రం ఉప్పాడలో జరిగే బహిరంగసభలోనూ పాల్గొంటారు. 26న రాజోలు, రామచంద్రాపురం, 27న పెద్దాపురం, కాకినాడ రూరల్‌, 28న జగ్గంపేట. ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగసభల్లో పవన్‌ పాల్గొని టీడీపీ, జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తారు. మే 4న తుని, పిఠాపురం సభల్లో పాల్గొంటారు. మే 10న పిఠాపురం, 11న కాకినాడ అర్బన్‌ నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొని అక్కడ జరిగే సభల్లో ప్రసంగిస్తారు. కాకినాడ పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పవన్‌సభలు ఉండనున్నాయి. ఇక్కడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ పోటీ చేస్తుండటంతో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలోనూ పవన్‌ ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 19 , 2024 | 01:23 AM