జగన్ బస్సుయాత్రలో నిబంధనలు బేఖాతరు
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:14 AM
పిఠాపురం, ఏప్రిల్ 19: జగన్ బస్సు యాత్రలో నిబంధనలు బేఖాతరయ్యాయి. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా 216వ జాతీయ రహదారిపై పిఠాపురం బైపాస్రోడ్డు లో పలుచోట్ల ఫెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు వీటిని ఏర్పాటు చేయడంతో అధికారులు పట్టించుకోలేదు. పాదగయ జంక్ష
పిఠాపురం, ఏప్రిల్ 19: జగన్ బస్సు యాత్రలో నిబంధనలు బేఖాతరయ్యాయి. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా 216వ జాతీయ రహదారిపై పిఠాపురం బైపాస్రోడ్డు లో పలుచోట్ల ఫెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు వీటిని ఏర్పాటు చేయడంతో అధికారులు పట్టించుకోలేదు. పాదగయ జంక్షన్ వద్ద నిలిపిన స్వాగత ద్వారం జగన్ వచ్చే బస్సుకు అడ్డుగా ఉంటుందని హడావుడిగా తొలగించినా మిగిలిన ఫ్లెక్సీలను మాత్రం వదిలివేశారు. ఎన్నికల నియమావళి అంటూ హడావుడి చేసిన ఫ్లయింగ్స్క్వాడ్ అధికారులు ఇటువైపు చూడకపోవడం గమనార్హం.