Share News

సీఎం జగన్‌ బీసీల ద్రోహి

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:32 AM

సీఎం జగన్‌ బీసీల ద్రోహి అని, వైసీపీ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీలకు మొదటి నుంచి అండగా వున్న ఏకైక పార్టీ టీడీపీ అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా బీసీ ప్రచార వాహనాలను ఆయన నివాసం వద్ద పార్టీ నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

సీఎం జగన్‌ బీసీల ద్రోహి
బీసీ ప్రచార వాహనాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గోరంట్ల

రాజమహేంద్రవరం రూరల్‌, మార్చి 11: సీఎం జగన్‌ బీసీల ద్రోహి అని, వైసీపీ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీలకు మొదటి నుంచి అండగా వున్న ఏకైక పార్టీ టీడీపీ అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా బీసీ ప్రచార వాహనాలను ఆయన నివాసం వద్ద పార్టీ నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ సమాజంలో సగభాగమైన బీసీలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తొందన్నారు. 300 మంది బీసీలను పొట్టన పెట్టుకున్నారని, వందలాది మందిపై అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. 30కి పైగా పథకాలను రద్దుచేసి బీసీలను ఆర్థికంగా అణగదొక్కారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తారని, వారి అభివృద్ధే ధ్యేయంగా చంద్రబాబు ప్రణాళికలు తయారు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వెలుగుబంటి సత్యప్రసాద్‌, మార్గాని సత్యనారాయణ, చెల్లుబోయిన శ్రీనివాస్‌, పితాని శివరామకృష్ణ, షేక్‌ సుభాన్‌, మత్యేటి ప్రసాద్‌, పండూరి అప్పారావు, ఆళ్ళ ఆనందరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:32 AM