Share News

నిడదవోలులో చెక్‌పోస్ట్‌ల తనిఖీ

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:09 AM

నియోజకవర్గంలోని పెరవలి, పాలంగ్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌లను తనిఖీ చేసి రికార్డును పరిశీలించినట్టు వ్యయ పరిశీలకుడు రోహిత్‌కుమార్‌ తెలిపారు.

నిడదవోలులో చెక్‌పోస్ట్‌ల తనిఖీ

నిడదవోలు, ఏప్రిల్‌ 19: నియోజకవర్గంలోని పెరవలి, పాలంగ్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌లను తనిఖీ చేసి రికార్డును పరిశీలించినట్టు వ్యయ పరిశీలకుడు రోహిత్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం నిడదవోలులోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తరచు తిరిగే వాహ నాలపై నిఘా పెట్టాలన్నారు. రిటర్నింగ్‌ అధికారి ఆర్‌వీ రమణ నాయక్‌ మాట్లా డుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ ఎమ్‌.భానుప్రకాష్‌, అసిస్టెంట్‌ ఎన్నికల వ్యయ పరిశీలకుడు బి.శ్రీనివాస్‌, లైజిన్‌ ఆఫీసర్‌ కె.కిషోర్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:09 AM