చంద్రబాబు ప్రజాగళం సభకు జన నీరాజనం
ABN , Publish Date - Apr 04 , 2024 | 12:30 AM
రావులపాలెంలోటీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రజాగళం సభకు జనం నీరాజనం పలికారు.
![చంద్రబాబు ప్రజాగళం సభకు జన నీరాజనం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆత్రేయపురం, ఏప్రిల్ 3: రావులపాలెంలోటీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రజాగళం సభకు జనం నీరాజనం పలికారు. పసుపు, ఎరుపు, కాషాయ రంగులతో ఆ ప్రాంతం కళకళలాడింది. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట, రావులపాలెం మండలాల్లోని 57గ్రామాల నుంచి ఉమ్మడి పార్టీ కార్యకర్తలు హాజర య్యారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో కెనాల్ రోడ్డులోని టీడీపీ కార్యాలయం వద్ద బహిరంగసభ హోరెత్తింది. కొత్తపేట అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు, అమలాపురం లోక్సభ అభ్యర్థి హరీష్మాధుర్లను గెలిపించాలని ప్రచారరథంపై నుంచి చంద్రబాబు పిలుపునిచ్చారు.