Share News

‘బ్రాహ్మణుడిని అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలి’

ABN , Publish Date - Apr 21 , 2024 | 12:50 AM

పిఠాపురం, ఏప్రిల్‌ 20: పెళ్లి సమయంలో బ్రాహ్మణుడిని అవమానపరిచిన అకతాయిలు, వీడియో వైరల్‌ చేసిన డీపీ క్రియేషన్స్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూపరిషత్‌, భజరంగదళ్‌, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. కొత్తపల్లి మండలం మూల

‘బ్రాహ్మణుడిని అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలి’

పిఠాపురం, ఏప్రిల్‌ 20: పెళ్లి సమయంలో బ్రాహ్మణుడిని అవమానపరిచిన అకతాయిలు, వీడియో వైరల్‌ చేసిన డీపీ క్రియేషన్స్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూపరిషత్‌, భజరంగదళ్‌, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. కొత్తపల్లి మండలం మూలపేటలో పురోహితునిగా ఉన్న ఆచెళ్ల సూర్యనారాయణమూర్తి శర్మ ఈ నెల 12న జరిగిన వివాహ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో కొందరు అకతాయులు పసుపు, కుంకుమ చిందరపందరగా పడవేసి అతడిని అవమానపరిచారు. డీపీ క్రియేషన్స్‌ ప్రతినిధులు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి, పురోహితుడిని అవమానపరిచే విధంగా పాట పెట్టి సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీనిపై వీహెచ్‌పీ, భజరంగదళ్‌, పిఠాపురం జయహనుమాన్‌ సేవాసమితి, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు వెంకటేశ్వరరావు, సురేంద్ర దత్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అవమానానికి గురయిన బ్రాహ్మణుడిని పరామర్శించి బాధ్యలపై కేసు నమోదుచేయాలని కోరారు.

Updated Date - Apr 21 , 2024 | 12:50 AM