బిక్కవోలు సుబ్రహ్మణ్య షష్ఠి పోస్టర్ల ఆవిష్కరణ
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:40 AM
వచ్చే నెల 7వ తేదీ నుంచి జరుగనున్న బిక్కవోలు సు బ్రహ్మణ్య షష్ఠి వేడుకల పోస్టర్ను ఎమ్మెల్యే నల్ల మిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం అనపర్తి ఎన్డీయే కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భం గా షష్ఠి ఉత్సవాల కమిటీ చైర్మన్ పల్లి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో షష్ఠి ఉత్స వాల ఆహ్వాన పత్రికను కూ డా ఆవిష్కరించి మొదటి పత్రికను ఎమ్మెల్యేకు అందజే శారు.
అనపర్తి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : వచ్చే నెల 7వ తేదీ నుంచి జరుగనున్న బిక్కవోలు సు బ్రహ్మణ్య షష్ఠి వేడుకల పోస్టర్ను ఎమ్మెల్యే నల్ల మిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం అనపర్తి ఎన్డీయే కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భం గా షష్ఠి ఉత్సవాల కమిటీ చైర్మన్ పల్లి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో షష్ఠి ఉత్స వాల ఆహ్వాన పత్రికను కూ డా ఆవిష్కరించి మొదటి పత్రికను ఎమ్మెల్యేకు అందజే శారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే నల్లమిల్లి మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన బిక్క వోలు సుబ్రహ్మణ్య స్వామిని షష్ఠి సందర్భంగా దర్శించు కునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా వస్తా రని, వారికి అసౌకర్యం కలుగకుండా కమిటీ ప్ర త్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్ర మంలో కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, రావాడ నాగు, గొర్రెల త్రిమూర్తులు, ఎస్.రామారావు, జంపా రమణ, చిటికన సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.