బీసీల అభివృద్ధికి టీడీపీ కృషి
ABN , Publish Date - Jan 08 , 2024 | 12:51 AM
బీసీల అభివృద్ధికి టీడీపీ కృషి
![బీసీల అభివృద్ధికి టీడీపీ కృషి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కపిలేశ్వరపురం, జనవరి 7: బీసీల అభ్యున్నతికి మొదటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మాచరలో రెండో రోజు ఆదివారం నిర్వహించిన బాబుష్యూరిటీ- భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటా పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్నీతిని, బీసీల పట్ల చూపిస్తున్న సవతితల్లి ప్రేమను ప్రతీఒక్కరూ గమనించి రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలని ఆయన కోరారు. ప్రముఖ కాపు నాయకుడు చోడిశెట్టి గోపాలకృష్ణ గ్రామంలోని అనుచరులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వా నించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.