Share News

జగన్‌ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం

ABN , Publish Date - Jan 07 , 2024 | 01:41 AM

జగన్‌ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం

జగన్‌ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం

రావులపాలెం, జనవరి 6: జగన్‌ పాలనలో బీసీలు అణచివేతకు గురయ్యారని, జగన్‌పాలనకు స్వస్తి పలికి ప్రజాపాలనను తీసుకువచ్చే చంద్రబాబును అధికారంలోకి తీసుకురా వాలని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు అండగా ఉండేది టీడీపేనన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బీసీలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. బీసీలకు జరిగే అన్యాయాలను వివరించి వారిలో చైతన్యం తీసుకురావడానికి టీడీపీ జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందన్నారు. జగన్‌ ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ప్రచార ఆర్భాటం తప్ప నిధులు ఇచ్చి వారికి అండగా నిలబడింది లేదన్నారు. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి వైసీపీని తరిమికొట్టాలన్నారు. సమావేశంలో గుత్తుల పట్టాభిరామారావు, కాసా సాగర్‌, దొమ్మేటి శ్రీను, కోట వెంకటేశ్వరరావు, కడలి లచ్చన్న, అత్తిలి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 01:41 AM