సత్యదేవుడికి వేడుకగా రథోత్సవం
ABN , Publish Date - May 26 , 2024 | 11:09 PM
అన్నవరం, మే 26: రత్నగిరివాసుడైన సత్యదేవుడికి ఆదివారం రథోత్సవం భక్తుల గోవిందనామస్మరణ నడుమ వేడుకగా జరిగింది. ఉదయం 10గంటలకు స్వామి,అమ్మవార్లను రథంపై ఆశీనులు గావించి ప్రత్యేక పూజలు అనంతరం ముమ్మారు తూర్పురాజగోపురం చుట్టూ ప్రదక్షణ గావించారు. చతు
అన్నవరం, మే 26: రత్నగిరివాసుడైన సత్యదేవుడికి ఆదివారం రథోత్సవం భక్తుల గోవిందనామస్మరణ నడుమ వేడుకగా జరిగింది. ఉదయం 10గంటలకు స్వామి,అమ్మవార్లను రథంపై ఆశీనులు గావించి ప్రత్యేక పూజలు అనంతరం ముమ్మారు తూర్పురాజగోపురం చుట్టూ ప్రదక్షణ గావించారు. చతుర్వేదపండితుల వేదాశీర్వచనం అనంతరం హారతులిచ్చి తిరిగి ఉత్సవమూర్తులను ప్రధానాలయానికి తీసుకెళ్లారు. పీఆర్వో కృష్ణారావు, ఏపీఆర్వో ఎం.గణపతి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సూర్యనమస్కారములు
రత్నగిరిపై కళామందిరంలో ఆరోగ్యప్రదాత అయిన సూర్యభగవానుడికి సూర్యనమస్కారములు కార్యక్రమం నిర్వహించారు. వివిధ ఆసనాలతో స్వామిని ప్రార్థించి క్షీరాన్నం నివేదించి భక్తులకు పంపిణీ చేశారు.