ఆనందరావును భారీ మెజారిటీతో గెలిపిస్తాం
ABN , Publish Date - Apr 19 , 2024 | 01:25 AM
అమలాపురం అసెంబ్లీ, లోక్సభ కూటమి అభ్యర్థులు అయితాబత్తుల ఆనందరావు, గంటి హరీష్లను భారీమెజారిటీతో గెలిపించుకోవాలని జనసైనికుల ఆత్మీయ సమావేశంలో తీర్మానించారు.
జన సైనికుల ఆత్మీయ సమావేశంలో తీర్మానం
ఉప్పలగుప్తం, ఏప్రిల్ 18: అమలాపురం అసెంబ్లీ, లోక్సభ కూటమి అభ్యర్థులు అయితాబత్తుల ఆనందరావు, గంటి హరీష్లను భారీమెజారిటీతో గెలిపించుకోవాలని జనసైనికుల ఆత్మీయ సమావేశంలో తీర్మానించారు. గురువారం కూనవరంలో ఆకుల బుజ్జి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూటమి అభ్యర్థుల విజయానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. శుక్రవారం ఆనందరావు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి అధిక సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు తరలి వెళ్లేందుకు వ్యూహరచన చేశారు. ఎంపీటీసీలు తాళ్ల లక్ష్మీనరసాయమ్మ, నాగులపల్లి శేషవేణి, చిక్కం భీముడు, సాకారాంబాబు, గుత్తాల సుభాష్చంద్రరావు, చిక్కం వెంకటకృష్ణ, సుం దరనీడి ఏసుబాబు,లంకే వెంకట్రావు, మారిశెట్టి రమేష్, నిమ్మకాయల మను, ఎరుబండి భద్ర, అరిగెల సూరిబాబు, సుందరనీడి వరలక్ష్మి, గనిశెట్టి లలిత, పెయ్యల మంగ పాల్గొన్నారు.