గోల్డ్ స్మగ్లింగ్ బ్యాచ్లను ప్రోత్సహిస్తున్న ఎంపీ భరత్రామ్
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:26 AM
ఇప్పటి వరకు బ్లేడ్బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, రౌడీమూకలను ప్రోత్సహించిన రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ ఏకంగా గోల్డ్ స్మగ్లర్లను ప్రోత్సహిస్తున్నారని టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 27: ఇప్పటి వరకు బ్లేడ్బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, రౌడీమూకలను ప్రోత్సహించిన రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ ఏకంగా గోల్డ్ స్మగ్లర్లను ప్రోత్సహిస్తున్నారని టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.రాజమహేంద్రవరం జగదీశ్వరీ హోటల్లో బుధవారం విలేకరులతో మా ట్లాడారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులకు రూ.2 కోట్ల విలువైన బంగారంతో పట్టుబడిన నరేష్కుమార్జైన్తో ఎంపీ భరత్రామ్కు సంబం ధాలు ఉన్నాయని ఆరోపించారు.భరత్రామ్తో నరేష్కుమార్జైన్ తిరుగుతున్న ఫొటోలను చూపించారు. గతేడాది నవంబరు 4న కస్టమ్స్ అధికారులు పట్టుకున్న బంగారం గురించి వాకబు చేస్తే మహారాష్ట్రకు చెందిన గౌతమ్ కుమార్,ఏపీకి చెందిన నరేష్కుమార్జైన్లు నిందితు లుగా తేల్చారని తెలిపారు. 5,198 గ్రాముల బంగారంను స్మగ్లింగ్ చేస్తుండగా కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారని దాని విలువ సుమారు రూ.2 కోట్లు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారని తెలిపారు. ఇలాంటి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను పక్కన పెట్టుకుని తిరుగుతూ రాజమహేంద్రవరం లో స్వర్ణ వర్తక సంఘం వారి దగ్గరకు తీసుకెళ్లి భరత్రామ్ ప్రచారం సాగిస్తున్నారన్నారు. భరత్రామ్కు చెందిన ఐశ్వర్య జ్యూయలర్స్ వ్యాపారాన్ని మూసివేయడం చూస్తుంటే ఇలాంటి స్మగ్లింగ్ సంబంధాలు ఉన్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.