Share News

వైద్యం కోసం బిడ్డతో బాలింత నిరీక్షణ

ABN , Publish Date - Feb 13 , 2024 | 01:00 AM

మండపేట, ఫిబ్రవరి 12: మండపేట ప్రభుత్వాసుప త్రికి వైద్యం కోసం వచ్చిన గిరిజన మహిళ నాలుగు గంటలు వైద్యుల కోసం నిరీక్షించినా స్పందన లేదు. దీంతో జనసైనికులు బాలింతను బిడ్డను 108లో కాకినాడకు తర లించి ప్రాణాలను కాపాడారు. విశాఖ జిల్లా కాకరపాడు గ్రామానికి చెం దిన గిరిజన మహిళ మర్రికాం

వైద్యం కోసం బిడ్డతో బాలింత నిరీక్షణ
మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలకోసం నిరీక్షించిన దృశ్యం

జనసైనికుల స్పందనతో కాకినాడ తరలింపు

మండపేట, ఫిబ్రవరి 12: మండపేట ప్రభుత్వాసుప త్రికి వైద్యం కోసం వచ్చిన గిరిజన మహిళ నాలుగు గంటలు వైద్యుల కోసం నిరీక్షించినా స్పందన లేదు. దీంతో జనసైనికులు బాలింతను బిడ్డను 108లో కాకినాడకు తర లించి ప్రాణాలను కాపాడారు. విశాఖ జిల్లా కాకరపాడు గ్రామానికి చెం దిన గిరిజన మహిళ మర్రికాంతమ్మ కుటుంబంతో పొట్టకూటి కోసం కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి వచ్చింది. ఆమె ఆదివారం తాపేశ్వరంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడే బిడ్డకు జన్మనిచ్చిం ది. ఆమెను వైద్యం కోసం బంధువులు కేశవరం ప్రభుత్వాసుపత్రికి తీసు కువెళ్లారు. అక్కడి వైద్యుల సూచనతో సోమవారం మండపేట ఆసుప త్రికి బిడ్డతో బాలింత వచ్చింది. నాలుగు గంటలు నిరీక్షించినా అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. దీంతో జనసైనికులు స్పందించి ఆమెను, బిడ్డను 108లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి పంపించారు. జనసేన మను కృష్ణ, ఇప్పనపాడు ఉపసర్పంచ్‌ కుంచే దుర్గాప్రసాద్‌ మండపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 01:00 AM