Share News

తాడిచెట్టు పైనుంచి జారిపడి దింపు కార్మికుడి మృతి

ABN , Publish Date - May 25 , 2024 | 12:09 AM

జీవనోపాధి కోసం తాటి ముంజులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న దింపు కార్మికుడు బిండ్రాల పోలయ్య(40) శుక్రవారం ప్రమాదవశాత్తూ తాడిచెట్టుపై నుంచి పడి మృతిచెందినట్టు మలికిపురం ఎస్‌ఐ బి.సంపత్‌కుమార్‌ తెలిపారు.

తాడిచెట్టు పైనుంచి జారిపడి దింపు కార్మికుడి మృతి

మలికిపురం, మే 24: జీవనోపాధి కోసం తాటి ముంజులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న దింపు కార్మికుడు బిండ్రాల పోలయ్య(40) శుక్రవారం ప్రమాదవశాత్తూ తాడిచెట్టుపై నుంచి పడి మృతిచెందినట్టు మలికిపురం ఎస్‌ఐ బి.సంపత్‌కుమార్‌ తెలిపారు. ప్రత్తిపాడుకు చెందిన పోలయ్య దింపులు తీసుకుంటూ గుడిమెళ్లంకలో జీవనం సాగిస్తున్నాడు. వేసవి కావడంతో తాటి ముంజులు విక్రయిస్తున్నాడు. శుక్రవారం తాటి ముంజులు కొట్టడానికి వెళ్లి చెట్టుపై నుంచి పడి మృతిచెందినట్టు భార్య దుర్గ ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. పోలయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

Updated Date - May 25 , 2024 | 12:09 AM