Share News

అన్నక్యాంటీను వద్ద 500రోజుల వేడుకలు

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:53 AM

అన్నక్యాంటీను వద్ద 500రోజుల వేడుకలు

అన్నక్యాంటీను వద్ద 500రోజుల వేడుకలు

అమలాపురం, ఫిబ్రవరి12 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ దివం గత స్పీకర్‌ జీఎంసీ బాలయోగి తనయుడు, టీడీపీ అమలాపురం పార్లమెంటరీ ఇన్‌చార్జి గంటి హరీష్‌మాధుర్‌ ఆధ్వర్యంలో అమలాపురం మెయిన్‌రోడ్డులో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీను ప్రారంభించి 500రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా సోమవారం వేడుకలు నిర్వహించారు. ఇప్పటివరకు 1.50లక్షలమందికి భోజనాలు పెట్టినట్టు హరీష్‌మాధుర్‌ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, రాష్ట్రకార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి సమక్షంలో భారీ కేక్‌ను కట్‌చేశారు. 500వరోజు ప్రత్యేకఅన్నదానం నిర్వహించారు. జనసేన అమ లాపురం పార్లమెంటరీ ఇన్‌చార్జి డీఎంఆర్‌ శేఖర్‌, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమా, నాయకులు చిక్కాల గణేష్‌, గంధం పల్లంరాజు, బత్తుల ప్రసాద్‌, నల్లా స్వామి, సలాది సతీష్‌రాజు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నార్తులకు భోజనాలు అందించారు. వారితో సహపంక్తి భోజనాలు చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 12:53 AM