Share News

AP News: కోస్తా జిల్లాల్లో ఉదయం నుంచి దట్టమైన పొగమంచు..

ABN , Publish Date - Feb 15 , 2024 | 08:37 AM

కోస్తా జిల్లాల్లో గురువారం ఉదయం నుంచి దట్టమైన పొగమంచు పడుతోంది. దీంతో జాతీయ రహదారిపై వాహన చోదకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారి సరిగా కనిపించకపోవడంతో డ్రైవర్లు అవస్తలు పడుతున్నారు. డ్రైవర్లు పలు ప్రాంతాల్లో వాహనాలను నిలిపివేశారు.

AP News: కోస్తా జిల్లాల్లో ఉదయం నుంచి దట్టమైన పొగమంచు..

జగ్గయ్యపేట: కోస్తా జిల్లాల్లో గురువారం ఉదయం నుంచి దట్టమైన పొగమంచు పడుతోంది. దీంతో జాతీయ రహదారిపై వాహన చోదకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారి సరిగా కనిపించకపోవడంతో డ్రైవర్లు అవస్తలు పడుతున్నారు. డ్రైవర్లు పలు ప్రాంతాల్లో వాహనాలను నిలిపివేశారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై పలు చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. జగ్గయ్య పేట, నందిగామ, ఇబ్రహీంపట్నం వంటి పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది.

గాల్లో చక్కర్లు కొడుతున్న విమానాలు..

దట్టమైన పొగమంచు విమానయానంపై కూడా ప్రభావం చూపుతోంది. పలు విమానాలు గన్నవరం విమానాశ్రయంలో చక్కర్లు కొడుతున్నాయి. చెన్నై, హైదరాబాద్ నుంచి వచ్చిన విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. సుమారు అరగంట నుంచి ఇదే పరిస్థితి నెలకొంది.

Updated Date - Feb 15 , 2024 | 08:51 AM