Share News

Ramakrishna: జగన్ సర్కార్‌కు అంగన్వాడీ కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది..

ABN , Publish Date - Jan 15 , 2024 | 09:26 AM

Andhrapradesh: అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్ష ఆరు వేల మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేసింది జగన్మోహన్ రెడ్డే అని అని మండిపడ్డారు.

Ramakrishna: జగన్ సర్కార్‌కు అంగన్వాడీ కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది..

అమరావతి, జనవరి 15: అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) స్వయంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader Ramakrishna) డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్ష ఆరు వేల మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేసింది జగన్మోహన్ రెడ్డే అని అని మండిపడ్డారు. ఇచ్చిన మాట అమలు చేసుంటే అంగన్వాడీలు రోడ్డేక్కేవారా? అని ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చర్చలెందుకు జరపటం లేదని నిలదీశారు. జగన్ మాట తప్పను, మడమ తిప్పను అంటే ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పండుగ చేసుకుంటూ, అంగన్వాడీలను వీధులపాలు చేశారని విరుచుకుపడ్డారు. జగన్ సర్కారుకు అంగన్వాడీ కుటుంబాల ఉసురు తగిలి తీరుతుందని రామకృష్ణ హెచ్చరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 15 , 2024 | 09:26 AM