వడదెబ్బతో మహిళ మృతి
ABN , Publish Date - Apr 24 , 2024 | 01:55 AM
వడదెబ్బకు గురై పుత్తూరు మండలంలో ఓ మహిళ మృతి చెందింది. పరమేశ్వరమంగళం దళితవాడకు చెందిన ఎం.కృష్ణమ్మకు వడదెబ్బ తగలడంతో మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
పుత్తూరు అర్బన్, ఏప్రిల్ 23: వడదెబ్బకు గురై పుత్తూరు మండలంలో ఓ మహిళ మృతి చెందింది. పరమేశ్వరమంగళం దళితవాడకు చెందిన ఎం.కృష్ణమ్మకు వడదెబ్బ తగలడంతో మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబసభ్యులు నగరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడే ఆమె మృతి చెందింది. .