Share News

ఏమైందో పాపం..!

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:42 AM

పలమనేరు సమీపం సాయినగర్‌లో నివాసం ఉంటున్న హరికృష్ణ రెండేళ్ల కుమార్తె దేవాన్షి అపస్మారక స్థితిలో ఉండగా గురువారం మధ్యాహ్నం ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు.

ఏమైందో పాపం..!
ప్రభుత్వాస్పత్రిలో చిన్నారి మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి

పలమనేరు సమీపం సాయినగర్‌లో నివాసం ఉంటున్న హరికృష్ణ రెండేళ్ల కుమార్తె దేవాన్షి అపస్మారక స్థితిలో ఉండగా గురువారం మధ్యాహ్నం ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చిన్నారి గొంతువద్ద కందిపోయి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. ‘ఈ చిన్నారి రెండు రెండు మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలో జోలలో ఆడుకొంటూ కిందపడింది. వెంటనే గమనించి కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకొచ్చారు’ అని పోలీసులు తెలిపారు.

- పలమనేరు

Updated Date - Feb 02 , 2024 | 12:42 AM