Share News

ఎమ్మెల్యేగా రెడ్డెప్ప వద్దు, నారాయణస్వామి కావాలి

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:21 AM

జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డెప్ప వద్దని, నారాయణస్వామి కావాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యేగా రెడ్డెప్ప వద్దు, నారాయణస్వామి కావాలి

- జీడీనెల్లూరు నియోజకవర్గ వైసీపీ నేతలు

చిత్తూరు సిటీ, జనవరి 20: జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డెప్ప వద్దని, నారాయణస్వామి కావాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేశారు. శనివారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల వైసీపీ అధ్యక్షులు, పార్టీ నేతలు వేర్వేరుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ అధిష్ఠానం నాల్గవ విడతగా విడుదల చేసిన ఎమ్మెల్యే, ఎంపీల జాబితాలో ప్రస్తుత జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీగా.. చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను జీడీ నెల్లూరు ఎమ్మెల్యే అభర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని వైసీపీ నేతలు నారాయణ స్వామికే తిరిగి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నారాయణ స్వామికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీచేశారు. అలాగే రెడ్డెప్పకు తాము సహకరించబోమని తేల్చి చెప్పారు.

Updated Date - Jan 21 , 2024 | 12:21 AM