వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.78.39 లక్షలు
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:51 AM
కాణిపాక వరసిద్ధుడి ఆలయ హుండీ ద్వారా రూ.78,39,048 లభించింది. హుండీ కానుకలను ఆలయ ఆస్థాన మండపంలో బుధవారం లెక్కించారు.
ఐరాల(కాణిపాకం), మార్చి 27: కాణిపాక వరసిద్ధుడి ఆలయ హుండీ ద్వారా రూ.78,39,048 లభించింది. హుండీ కానుకలను ఆలయ ఆస్థాన మండపంలో బుధవారం లెక్కించారు. 14 గ్రాముల బంగారు, 910 గ్రాముల వెండి, 1,066 యూఎ్సఏ, 50 ఆస్ర్టేలియా డాలర్లు, 15 ఇంగ్లాండ్ ఫౌండ్లు, ఒక మలేసియా రింగిట్ లభించాయి. అలాగే గో సంరక్షణ హుండీ ద్వారా రూ.5,409, నిత్యాన్నదానసత్రం వద్ద హుండీ ద్వారా రూ.20,190 లభించాయి. ఈ ఆదాయం 14 రోజులలో లభించింది. ఈ లెక్కింపులో ఈవో వెంకటేశు, డీఈవో వాణి, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్రెడ్డి, హరిమాధవరెడ్డి, ధనంజయ, సూపరింటెండెట్లు కోదండపాణి, శ్రీధర్బాబు తదితరులు పాల్గొన్నారు.