ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 05 , 2024 | 12:56 AM
ఇంట్లో ఉరేసుకుని తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు
అనుమానాస్పదస్థితిలో మృతిగా కేసు నమోదు
చౌడేపల్లె, ఏప్రిల్ 4: ఇంట్లో ఉరేసుకుని తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ప్రతా్పరెడ్డి తెలిపిన ప్రకారం.. చౌడేపల్లెలోని సచివాలయం-1లో వీహెచ్ఏగా పనిచేస్తున్న హేమకల్యాణి.. ఆమెచిన్న కమారుడు సాయి రితీ్ష(14) కలిసి బజారువీధిలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆమె భర్త బెంగళూరులో హోటల్ నడుపుతున్నారు. 9వ తరగతి చదువుతున్న రితీష్ మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. కాగా, సచివాలయంలో విధులు ముగించుకుని మధ్యాహ్నం 2 గంటలకు హేమకల్యాణి ఇంటికి వచ్చారు. ఇంటి తలుపులు వేసి ఉండటం, కుమారుడిని పిలిచినా పలకలేదు. తలుపు గడిని బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి చూసే సరికి దూలానికి ఊరేసుకుని వేలాడుతున్న కుమారుడిని చూసి షాక్కు గురయ్యారు. కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సహదేవుడు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.