Share News

ఏడుగురు బీఎస్పీ నేతలపై చోరీ కేసు

ABN , Publish Date - Mar 24 , 2024 | 01:59 AM

సత్యవేడు నియోజకవర్గానికి చెందిన ఏడుగురు బీఎస్పీ నేతలపై పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు.

ఏడుగురు బీఎస్పీ నేతలపై చోరీ కేసు

నాగలాపురం, మార్చి 23: సత్యవేడు నియోజకవర్గానికి చెందిన ఏడుగురు బీఎస్పీ నేతలపై పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు.ఎస్‌ఐ ఓబయ్య కథనం మేరకు.. సత్యవేడు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ధనంజయన్‌ ఆధ్వర్యంలో మండల నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సుబ్బానాయుడు కండ్రిగలోని రీచ్‌ వద్ద ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రీచ్‌ ప్రతినిధులకు, బీఎస్పీ నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ సందర్భంగా బీఎస్సీ నేతలు రీచ్‌ సిబ్బంది వద్ద నగదు ఉన్న సంచిని లాక్కొని, తిరిగి ఇచ్చారని.. అయితే అందులో నుంచి రూ.2,15,400 చోరీ చేశారంటూ రీచ్‌ ఇన్‌చార్జి లోకే్‌షరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీఎస్పీ నేతలు పృథ్వీరాజు, వనరాజు, విద్యాసాగర్‌, అదిశయ రాజ్‌, చిన్న, వేలాంగన్నిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 24 , 2024 | 01:59 AM