ఘర్షణలో గాయపడ్డ వ్యక్తి మృతి
ABN , Publish Date - Mar 11 , 2024 | 12:59 AM
బంగారుపాళ్యం మండలంలో ఇటీవల జరిగిన గొడవలో గాయపడ్డ పురుషోత్తం.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు.
![ఘర్షణలో గాయపడ్డ వ్యక్తి మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బంగారుపాళ్యం, మార్చి 10: బంగారుపాళ్యం మండలంలో ఇటీవల జరిగిన గొడవలో గాయపడ్డ పురుషోత్తం.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. టేకుమంద గ్రామానికి చెందిన పురుషోత్తం, రమేష్ కుటుంబాల మధ్య బోరు మోటరు విషయమై మూడో తేదీన పొలం వద్ద గొడవ జరిగింది. రమేష్ కుటుంబసభ్యులు పురుషోత్తంను గాయపరిచారు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి.. అక్కడ్నుంచి తిరుపతిలోని స్విమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి పురుషోత్తం (56) మృతిచెందాడు. ఇతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య జగదాంబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేష్ కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బంగారుపాళ్యం, మార్చి 10: బంగారుపాళ్యం మండలంలో ఇటీవల జరిగిన గొడవలో గాయపడ్డ పురుషోత్తం.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. టేకుమంద గ్రామానికి చెందిన పురుషోత్తం, రమేష్ కుటుంబాల మధ్య బోరు మోటరు విషయమై మూడో తేదీన పొలం వద్ద గొడవ జరిగింది. రమేష్ కుటుంబసభ్యులు పురుషోత్తంను గాయపరిచారు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి.. అక్కడ్నుంచి తిరుపతిలోని స్విమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి పురుషోత్తం (56) మృతిచెందాడు. ఇతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య జగదాంబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేష్ కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.