శ్రీకాళహస్తి కళాకారుడికి అరుదైన అవకాశం
ABN , Publish Date - Aug 24 , 2024 | 01:38 AM
శ్రీకాళహస్తికి చెందిన కలంకారీ కళాకారుడు,శిల్పగురు అవార్డు గ్రహీత గురు శ్రీనివాసులుకు అరుదైన అవకాశం లభించింది. ప్యారిస్లో పారా ఒలంపిక్స్ ముగింపు సంబరాల్లో ఆయన పాల్గొననున్నారు.
శ్రీకాళహస్తి, ఆగస్టు 23: శ్రీకాళహస్తికి చెందిన కలంకారీ కళాకారుడు,శిల్పగురు అవార్డు గ్రహీత గురు శ్రీనివాసులుకు అరుదైన అవకాశం లభించింది. ప్యారిస్లో పారా ఒలంపిక్స్ ముగింపు సంబరాల్లో ఆయన పాల్గొననున్నారు. అక్కడ కలంకారీ ప్రదర్శనకు భారత ప్రభుత్వం తరపున ఆహ్వానం అందినట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 5 నుంచి 9వ తేదీ వరకు ప్యారిస్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు.