Share News

ఇంటర్‌ పరీక్షల్లో ఆరుగురి డీబార్‌

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:59 AM

జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్‌ సెకండియర్‌ ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పేపర్‌ 2 పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులను డీబార్‌ చేసినట్లు డీవీఈవో సయ్యద్‌ మౌల తెలిపారు

ఇంటర్‌ పరీక్షల్లో ఆరుగురి డీబార్‌

చిత్తూరు (సెంట్రల్‌), మార్చి 13: జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్‌ సెకండియర్‌ ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పేపర్‌ 2 పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులను డీబార్‌ చేసినట్లు డీవీఈవో సయ్యద్‌ మౌల తెలిపారు. వీరిలో ఎన్‌ఆర్‌ పేట సెంటర్‌లో ఇద్దరు, బొమ్మసముద్రం జూనియర్‌ కళాశాలలోని నలుగురు ఉన్నారన్నారు. కాగా, 14349 మంది విద్యార్థులకు గాను 13523 మంది పరీక్షలకు హాజరు కాగా, 826 మంది గైర్హాజరైనట్లు చెప్పారు.

Updated Date - Mar 14 , 2024 | 12:59 AM