Share News

‘లక్‌పతి దీదీ’ కింద రూ.150.14 కోట్లు

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:50 AM

ప్రధాన మంత్రి మోదీ ‘లక్‌పతి దీదీ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల సభ్యులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

‘లక్‌పతి దీదీ’ కింద రూ.150.14 కోట్లు
ప్రశంసా పత్రాలు పొందిన మహిళా సంఘాల సభ్యులతో డీఆర్‌డీఏ పీడీ తులసి

చిత్తూరు (సెంట్రల్‌), మార్చి 11: ప్రధాన మంత్రి మోదీ ‘లక్‌పతి దీదీ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల సభ్యులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరులోని కలెక్టరేట్‌ నుంచి డీఆర్‌డీఏ పీడీ తులసితో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా లక్‌పతి దీదీ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 1419 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.150.14 కోట్లను చెక్కుల రూపంలో పీడీ అందించారు. జీవనోపాధులను ఎంచుకుని ఆర్థికంగా స్థిరపడిన మహిళా సభ్యులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

Updated Date - Mar 12 , 2024 | 01:50 AM