Share News

రూ. 80వేల గంజాయి సీజ్‌

ABN , Publish Date - Mar 14 , 2024 | 01:04 AM

గంజాయి తరలిస్తున్న పాత కేసులో పరారీలో ఉన్న నిందితుడిని రెండో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.80వేల విలువ చేసే గంజాయిని, ప్యాసింజర్‌ ఆటోను సీజ్‌ చేశారు.

రూ. 80వేల గంజాయి సీజ్‌
నిందితుడిని మీడియాకు చూపిస్తున్న సీఐ

పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు

చిత్తూరు, మార్చి 13: గంజాయి తరలిస్తున్న పాత కేసులో పరారీలో ఉన్న నిందితుడిని రెండో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.80వేల విలువ చేసే గంజాయిని, ప్యాసింజర్‌ ఆటోను సీజ్‌ చేశారు. రెండో పట్టణ సీఐ ఉలసయ్య తెలిపిన ప్రకారం.. బుధవారం కాణిపాకం జంక్షన్‌ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ప్యాసింజర్‌ ఆటోలో వస్తున్న సంతపేటకు చెందిన రవికుమార్‌ అలియాస్‌ ఆటో రవిని అనుమానం వచ్చి తనిఖీ చేశారు. ఆ ఆటోలో ఉన్న రూ.80వేల విలువ చేసే రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆటో రవిని అదుపులోకి తీసుకుని విచారించగా గతంలో ఓ కేసులో నిందితుడిగా ఉండి.. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నట్లు తెలిసింది. అతడిని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషిచేసిన బాబు, హరిప్రసాద్‌, ధనరాజ్‌, మధు, గోవిందరావును సీఐ అభినందించారు.

Updated Date - Mar 14 , 2024 | 01:04 AM