రేపటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు
ABN , Publish Date - Mar 11 , 2024 | 01:52 AM
రంజాన్ మాసం సందర్భంగా మంగళవారం ఉదయం నుంచి ఏప్రిల్ 10వ తేది వరకు ఉపవాస దీక్షలు చేపడుతున్నట్లు ప్రభుత్వ ఖాజీ సయ్యద్ కమాలుల్లా జుహూరి తెలిపారు.
![రేపటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు](https://media.andhrajyothy.com/media/2024/20240306/tdp_f33ea99ff2.jpg)
చిత్తూరు కల్చరల్, మార్చి 10: రంజాన్ మాసం సందర్భంగా మంగళవారం ఉదయం నుంచి ఏప్రిల్ 10వ తేది వరకు ఉపవాస దీక్షలు చేపడుతున్నట్లు ప్రభుత్వ ఖాజీ సయ్యద్ కమాలుల్లా జుహూరి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన రంజాన్ ఉపవాస కాలమాన పట్టికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ ఘని, డివిజన్ ఖాజి నయిముల్లా జునైది, కార్పొరేటర్లు అను, సయ్యద్, రషీద్, బషీర్, అహమద్, అబ్దుల్ గఫార్, గులాం రసూల్, సుల్లాన్, మునీర్, అడ్వికేట్ మొహిద్ధీన్, ముక్తార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.