కాణిపాకంలో పున్నమి గరుడ సేవ
ABN , Publish Date - Feb 25 , 2024 | 12:44 AM
కాణిపాకంలోని వరదరాజస్వామి ఆలయంలో శనివారం పున్నమి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు.
![కాణిపాకంలో పున్నమి గరుడ సేవ](https://media.andhrajyothy.com/media/2024/20240224/24ctr_irl6_FF_ff484fa7c6.jpg)
ఐరాల(కాణిపాకం),ఫిబ్రవరి 24: కాణిపాకంలోని వరదరాజస్వామి ఆలయంలో శనివారం పున్నమి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. ఉదయం వరదరాజస్వామి మూల విరాట్కు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి పూజ, వ్రతాన్ని నిర్వహింపచేశారు. అనంతరం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వరదరాజస్వామి ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఉంచి కాణిపాకం పురవీధులలో అంగరంగ వైభవంగా ఊరేగించారు. గరుడుడిపై స్వామివారిని దర్శించుకునేందుకు వందలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మోహన్రెడ్డి, ఈవో వెంకటేశు, ఏఈవో విద్యాసాగర్రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీధర్బాబు, కోదండపాణి,ఆలయ ఇన్స్పెక్టరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.