Share News

టెన్త్‌ స్పాట్‌లో సౌకర్యాల కల్పన: డీఈవో

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:43 AM

టెన్త్‌ స్పాట్‌ కేంద్రంలో టీచర్లకు అవసరమైన ఏర్పాట్లు కల్పించినట్లు డీఈవో దేవరాజు తెలిపారు. స్పాట్‌ను పరిశీలించిన జిల్లా పరిశీలకులు మస్తానయ్య తెలిపిన వివరాలతో గురువారం ఆంధ్రజ్యోతిలో వెలువడిన ‘స్పాట్‌లో సౌకర్యాలు లేమి..!’ శీర్షికపై డీఈవో స్పందించి, వివరణ ఇచ్చారు.

టెన్త్‌ స్పాట్‌లో సౌకర్యాల కల్పన: డీఈవో

చిత్తూరు (సెంట్రల్‌), ఏప్రిల్‌ 4: టెన్త్‌ స్పాట్‌ కేంద్రంలో టీచర్లకు అవసరమైన ఏర్పాట్లు కల్పించినట్లు డీఈవో దేవరాజు తెలిపారు. స్పాట్‌ను పరిశీలించిన జిల్లా పరిశీలకులు మస్తానయ్య తెలిపిన వివరాలతో గురువారం ఆంధ్రజ్యోతిలో వెలువడిన ‘స్పాట్‌లో సౌకర్యాలు లేమి..!’ శీర్షికపై డీఈవో స్పందించి, వివరణ ఇచ్చారు. క్యాంపులో 1646 మంది ఉపాధ్యాయులు సీసీఓలు, ఏసీఓలు, సీఈలు, ఏఈ, స్పెషల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి అవసరమైన 450 టేబుల్స్‌, 960 కుర్చీలు, 60 ఫెడస్ట్రియల్‌ ఫ్యాన్లు, 60 సీలింగ్‌ ఫ్యాన్లు, ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులతో మెడికల్‌ క్యాంపు, భోజన వసతి కోసం క్యాంపులో క్యాంటీన్‌, గదుల్లో వెలుతురు ఉండేలా సీట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Updated Date - Apr 05 , 2024 | 08:39 AM