ఒకటి నుంచి ప్రాక్టికల్స్ తరగతులు
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:44 AM
బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల సెంటర్లోని ఫస్టియర్ డిగ్రీ విద్యార్థులకు ఫస్టు సెమిస్టర్ ప్రాక్టికల్స్ తరగతులు ఏప్రిల్ ఒకటి నుంచి మే నెల 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ మీరాసాహెబ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు (సెంట్రల్), మార్చి 27: బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల సెంటర్లోని ఫస్టియర్ డిగ్రీ విద్యార్థులకు ఫస్టు సెమిస్టర్ ప్రాక్టికల్స్ తరగతులు ఏప్రిల్ ఒకటి నుంచి మే నెల 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ మీరాసాహెబ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు ఉంటాయన్నారు. ఏప్రిల్ 12న రంజాన్, 17న శ్రీరామనవమి సందర్భంగా సెలవులు ఉంటాయన్నారు.