పోస్టల్ బ్యాలెట్ గడువు 23 వరకు పొడిగింపు
ABN , Publish Date - Apr 22 , 2024 | 02:18 AM
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేందుకు కల్పించిన అవకాశాన్ని 23వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ షన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
![పోస్టల్ బ్యాలెట్ గడువు 23 వరకు పొడిగింపు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 21: పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేందుకు కల్పించిన అవకాశాన్ని 23వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ షన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల విధులకు కేటాయించిన అధికారులు, సిబ్బందికి జిల్లాలో ఓటుహక్కు ఉంటే వినియోగించుకునేందుకు ఫారం-12 పూరించి, ఈ నెల 23వ తేదీలోగా ఆయా శాఖల హెచ్వోడీలకు అందజేయాలని పేర్కొన్నారు. గతంలో 22వ తేదీ వరకు ఉన్న ఈ అవకాశాన్ని పలువురు ఉద్యోగుల విన్నపం మేరకు ఒకరోజు పొడిగించామని వివరించారు. ఇతర జిల్లాలకు చెందిన అధికారులు, సిబ్బంది చిత్తూరు జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నట్లయితే అట్టివారు ఫారం-12, అనెగ్జర్ 12(ఇ)ని హెచ్ఓడీల ద్వారా కలెక్టర్కు సమర్పించాలని తెలిపారు. గడువులోగా ఫారాలు అందించకుంటే వారు సొంత నియోజకవర్గాలకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాల్సి ఉంటుందని వివరించారు. అటువంటి వారికి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే వెసులుబాటు ఉండదని తెలిపారు.