టీడీపీ విజయంపై నారావారిపల్లెలో పూజలు
ABN , Publish Date - Jun 08 , 2024 | 02:03 AM
ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా విజయఢంకా మోగించడంతో పాటు చంద్రగిరిలో 25 ఏళ్ళ తరువాత టీడీపీ గెలుపొందిన సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ అధినేత చంద్రబాబు సొంతూరులో గ్రామస్తులు శుక్రవారం కులదైవం నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
![టీడీపీ విజయంపై నారావారిపల్లెలో పూజలు](https://media.andhrajyothy.com/media/2024/20240604/7_CGR_2_FF_9a3748d490.jpg)
చంద్రగిరి, జూన్ 7: ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా విజయఢంకా మోగించడంతో పాటు చంద్రగిరిలో 25 ఏళ్ళ తరువాత టీడీపీ గెలుపొందిన సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ అధినేత చంద్రబాబు సొంతూరులో గ్రామస్తులు శుక్రవారం కులదైవం నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు కుల దైవం కూడా అయిన నాగాలమ్మ పూజల్లో ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.