Share News

తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

ABN , Publish Date - Jan 13 , 2024 | 02:14 AM

తిరుపతి విమానాశ్రయం నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం బయల్దేరవలసిన ఇండిగో విమానం రద్దు కావడంతో 26మంది ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొ న్నారు.

తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

రేణిగుంట, జనవరి 12 : తిరుపతి విమానాశ్రయం నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం బయల్దేరవలసిన ఇండిగో విమానం రద్దు కావడంతో 26మంది ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొ న్నారు.ప్రయాణికులు విమానాశ్రయంలోకి వెళ్ళి చెక్‌అవుట్‌ పూర్తి చేసుకున్న అనంతరం విమానం రద్దయినట్లు ఇండిగో విమాన యాజమాన్యం ప్రకటించినట్లు ప్రయాణికులు తెలిపారు.తమకు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని కోరగా, శనివారం సాయంత్రంలోపు ఏర్పాటు చేస్తామని ఇండిగో మేనేజరు శివరామకృష్ణవరప్రసాద్‌ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే విమాన ఛార్జీలను రీఫండ్‌ చేయడానికి తనకు అనుమతులు లేవని చెప్పారని తెలిపారు. అప్పటి వరకు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని ప్రయాణికులు వాపోయారు.ఈ విషయంపై విమానాశ్రయ డైరెక్టర్‌ బసవరాజును వివరణ కోరగా ఇండిగో విమానం రద్దయిన విషయం నిజమేనన్నారు. ఆ ప్రయాణికులను ప్రత్యామ్నాయంగా చెన్నైనుంచి విశాఖ పంపించాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించినట్లు ఆయన చెప్పారు.లేని పక్షంలో ప్రయాణికులను శనివారం ఉదయం విశాఖపట్నం పంపే ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు.ప్రయాణికుల్లో కొందరు తమకు ఇప్పుడే ఇక్కడి నుంచే విమానం ఏర్పాటు చేయాలని ఇండిగో సిబ్బందిని ప్రయాణికులు నిలదీశారని డైరెక్టర్‌ తెలిపారు.గతంలోనూ ఇండిగో ఇలాగే ప్రయాణికులతో ఆడుకుందని ప్రయాణికులు ఆరోపించారు. ఈసారి తగినంత మంది ప్రయాణికులు లేకపోవడంతో రద్దు చేశామని ఇండిగో మేనేజరు చెప్పినట్లు మణికంఠ అనే ప్రయాణికుడు తెలిపారు.

Updated Date - Jan 13 , 2024 | 02:14 AM