Share News

కొనసాగుతున్న గజ దాడులు

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:06 AM

ఐరాల మండలం గుట్టపాళ్యంలో గజదాడులు కొనసాగుతున్నాయి. గుంపు నుంచి తప్పిపోయిన ఒంటరి ఏనుగు పంట పొలాలపై దాడులకు పాల్పడుతోంది.

కొనసాగుతున్న గజ దాడులు
ఏనుగు నాశనం చేసిన వరిపంట

ఐరాల(కాణిపాకం), మార్చి 10: ఐరాల మండలం గుట్టపాళ్యంలో గజదాడులు కొనసాగుతున్నాయి. గుంపు నుంచి తప్పిపోయిన ఒంటరి ఏనుగు పంట పొలాలపై దాడులకు పాల్పడుతోంది. శనివారం రాత్రి ఒంటరి ఏనుగు గుట్టపాళ్యానికి చెందిన శంరయ్య, సురే్‌ష, కార్తీక్‌, విజయ్‌కుమార్‌కు చెందిన నాలుగు ఎకరాల వరి పంటను తొక్కి నాశనం చేసింది. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో ఏనుగు పంట పొలాలను నాశనం చేసి తిరిగి అడవిలో తిష్ఠ వేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఎప్పుడు దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి సమయంలో పొలాల వద్దకు వెళ్లడానికి రైతులు భయపడుతున్నారు. ఏనుగులు గ్రామాల వైపు రాకుండా అటవీ ప్రాంతం వద్ద సోలార్‌ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ సందర్భంగా బీటు అధికారి లావణ్య మాట్లాడుతూ ఏనుగును ట్రాకర్ల సహాయంతో సదుం మండలం చీకలచేను అటవీ ప్రాంతానికి తరిమివేసినట్లు తెలిపారు.


ఐరాల(కాణిపాకం), మార్చి 10: ఐరాల మండలం గుట్టపాళ్యంలో గజదాడులు కొనసాగుతున్నాయి. గుంపు నుంచి తప్పిపోయిన ఒంటరి ఏనుగు పంట పొలాలపై దాడులకు పాల్పడుతోంది. శనివారం రాత్రి ఒంటరి ఏనుగు గుట్టపాళ్యానికి చెందిన శంరయ్య, సురే్‌ష, కార్తీక్‌, విజయ్‌కుమార్‌కు చెందిన నాలుగు ఎకరాల వరి పంటను తొక్కి నాశనం చేసింది. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో ఏనుగు పంట పొలాలను నాశనం చేసి తిరిగి అడవిలో తిష్ఠ వేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఎప్పుడు దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి సమయంలో పొలాల వద్దకు వెళ్లడానికి రైతులు భయపడుతున్నారు. ఏనుగులు గ్రామాల వైపు రాకుండా అటవీ ప్రాంతం వద్ద సోలార్‌ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ సందర్భంగా బీటు అధికారి లావణ్య మాట్లాడుతూ ఏనుగును ట్రాకర్ల సహాయంతో సదుం మండలం చీకలచేను అటవీ ప్రాంతానికి తరిమివేసినట్లు తెలిపారు.

Updated Date - Mar 11 , 2024 | 01:07 AM