మినీ వ్యాన్ ఢీకొని ఒకరి మృతి
ABN , Publish Date - Jan 08 , 2024 | 12:58 AM
రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని మినీ వ్యాన్ ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
పూతలపట్టు, జనవరి 7: రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని మినీ వ్యాన్ ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మండలంలోని కె. మోటకంపల్లె గ్రామానికి చెందిన రవీంద్రబాబు (61) బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈయన శనివారం రాత్రి స్వగ్రామానికి వస్తూ కొత్తకోట సమీపాన గల ఓ హోటల్ వద్దకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా నెల్లూరు నుంచి చిత్తూరు వైపుగా వెళ్తున్న మినీ వ్యాన్ ఢీకొంది. దీంతో రవీంద్రబాబు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు ఎస్ఐ రామ్భూపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.