Share News

ఏనుగు దాడిలో ఒకరి దుర్మరణం

ABN , Publish Date - May 13 , 2024 | 01:37 AM

ఒంటరి ఏనుగు దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వెంగంపల్లె ఎస్టీ కాలనీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

ఏనుగు దాడిలో ఒకరి దుర్మరణం
ఏనుగు దాడిలో మృతి చెందిన చిన్నయ్య

తవణంపల్లె, మే 12: ఒంటరి ఏనుగు దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వెంగంపల్లె ఎస్టీ కాలనీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎఫ్‌ఎస్‌వో జయశేఖర్‌ కథనం మేరకు.. మండలంలోని వెంగంపల్లె ఎస్టీ కాలనీకి చెందిన చిన్నయ్య(50) ఉదయం బహిర్భూమి నిమిత్తం గ్రామ సమీపంలోని మామిడి తోపులోకి వెళ్లాడు. అప్పటికే అక్కడున్న ఒంటరి ఏనుగు ఆయనపై దాడి చేసింది. చెట్టుకేసి కొట్టి, కాలితో తొక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకునే లోపు ఏనుగు వెళ్లిపోయింది. గ్రామస్తుల సమాచారం మేరకు ఎఫ్‌ఆర్వో బాలకృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ఆస్పత్రికి తరలించారు.

Updated Date - May 16 , 2024 | 11:13 AM