Share News

కాంగ్రె్‌సలోకి డిప్యూటీ సీఎం మేనల్లుడు

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:47 AM

డిప్యూటీ సీఎం నారాయణస్వామికి మేనల్లుడు రమేష్‌ కాంగ్రె్‌సలో చేరారు. హైదరాబాదులో రెండు రోజుల కిందట ఆయన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రె్‌సలోకి డిప్యూటీ సీఎం మేనల్లుడు
కాంగ్రెస్‌ కండువా కప్పుతున్న షర్మిల

వైసీపీలో ఎస్పీలకు న్యాయం జరగనందునే చేరానన్న రమేష్‌

వెదురుకుప్పం/కార్వేటినగరం, మార్చి 27: డిప్యూటీ సీఎం నారాయణస్వామికి మేనల్లుడు రమేష్‌ కాంగ్రె్‌సలో చేరారు. హైదరాబాదులో రెండు రోజుల కిందట ఆయన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్వేటినగరం మండలం పాదిరికుప్పాకిఇ చెందిన ఆయన వైసీపీలో ఉన్నారు. డిప్యూటీ సీఎంకు అసమ్మతి వర్గంగా మారిన వారిలో ఒకరు. నారాయణస్వామికి వైసీపీ టికెట్‌ ఇవ్వరాదంటూ మీడియాకు ఎక్కారు. ఈ క్రమంలో నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మికి గంగాధరనెల్లూరు టికెట్‌ ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రె్‌సలో చేరారు. రాబోయే ఎన్నికల్లో గంగాధరనెల్లూరు నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వైసీపీలో ఎస్సీ సామాజిక వర్గానికి న్యాయం జరగకపోవడంతో కాంగ్రె్‌సలో చేరినట్లు ఆయన బుధవారం చెప్పారు. డిప్యూటీ సీఎం వల్ల కూడా నియోజకవర్గంలోని ఎస్సీలకు న్యాయం జరగలేదని.. నాన్‌ లోకల్‌ అయిన ఆయన కుమార్తె వల్ల అసలు న్యాయం జరగదన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారి అభిప్రాయం మేరకు ఈనెల 24న కాంగ్రె్‌సలో చేరానన్నారు. గంగాధరనెల్లూరు అభ్యర్థిగా బరిలో ఉంటానని చెప్పారు. తనను ప్రచారం చేసుకోమని షర్మిల చెప్పారని రమేష్‌ వెల్లడించారు.

Updated Date - Mar 28 , 2024 | 12:47 AM