తూర్పుకనుపూరులో ముత్యాలమ్మ జాతర ప్రారంభం
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:34 AM
చిల్లకూరు మండలంలోని తూర్పుకనుపూరులో మంగళవారం ముత్యాలమ్మ జాతర ప్రారంభమైంది.
![తూర్పుకనుపూరులో ముత్యాలమ్మ జాతర ప్రారంభం](https://media.andhrajyothy.com/media/2024/20240326/2gdr14_F_8f74e9d5cf.jpg)
చిల్లకూరు మండలంలోని తూర్పుకనుపూరులో మంగళవారం ముత్యాలమ్మ జాతర ప్రారంభమైంది.తూర్పుకనుపూరు, ఈదలవారిపాళెం, పోసినవారిపాళెం, రావులవారిపాళెం, కొమరావారిపాళెం గ్రామాల్లో ఘటాన్ని ఊరేగించారు. గంగమిట్ట మీద తాత్కాలికంగా పోలేరమ్మకు వేదిక ఏర్పాటు చేశారు. గుడిసెలో కుమ్మరి తయారు చేసిన పోలేరమ్మ విగ్రహాన్ని రజకులు తప్పెట్లు, తాళాలతో మోసుకువచ్చి ప్రతిష్టించారు. గాలిగంటల చెట్టు వద్ద కుంభం పోశారు. భక్తులు వేయికండ్ల కుండలలో గండదీపాలను వెలిగించుకుని నెత్తిన పెట్టుకుని, మొలకు వేపాకులు దరించి ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ముత్యాలమ్మకు బంగారుచీర అలంకారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.సామూహిక పల్లకీ సేవ, పూలంగిసేవ ఘనంగా జరిపారు. రాత్రికి అర్థరఽథంపై అమ్మవారిని సింహవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. -చిల్లకూరు