ఎంఎ్సఎంఈ సర్వే పకడ్బందీగా చేయాలి: కలెక్టర్
ABN , Publish Date - Mar 03 , 2024 | 01:02 AM
మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్ (ఎంఎ్సఎంఈ) సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ షన్మోహన్ ఆదేశించారు.
చిత్తూరు (సెంట్రల్), మార్చి 2: మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్ (ఎంఎ్సఎంఈ) సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ షన్మోహన్ ఆదేశించారు. రెవెన్యూ, రీ సర్వే మూడో దశ ఇనామ్, అసైన్డ్ భూములు, ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్, హౌసింగ్, పీఆర్అండ్ డీఆర్, ఎన్ఆర్ఈజీఎ్స, కరువు మండలాల్లో వేజ్ జనరేషన్, తాగునీటి ఎద్దడి, పరిశ్రమలు, ఎంఎ్సఎంఈలకు భూ కేటాయింపులు, ఆరోగ్యం, వైద్య, ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీకార్డుల పంపిణీ, పల్స్పోలియో తదితర అంశాలపై శనివారం విజయవాడ సీఎస్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్తోపాటు జేసీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లాలోని వివిధ శాఖాధికారులతో పైఅంశాలపై సమీక్షించారు. మూడోదశ రీసర్వేకి సంబంధించి 74 గ్రామాల్లో స్టోన్ ప్లాంటేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. 20213 హౌస్ సైట్స్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయగా, 82,483 ఉపాధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. 315807 ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ పూర్తి చేయగా, ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలన్నారు.