Share News

ఉచిత ప్రయాణం కోసం ఎదురు చూపులు

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:53 AM

జిల్లాలో రోజుకు 32 వేల మహిళలకు లబ్ది

ఉచిత ప్రయాణం కోసం ఎదురు చూపులు

చిత్తూరు రూరల్‌, జూన్‌ 11: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ అమలు కోసం జిల్లా మహిళలు ఎదురు చూస్తున్నారు. నేడు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం తర్వాత ఈ పథకం అమలు గురించి ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇందువల్ల జిల్లాలో రోజుకు 32 వేల మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. మహిళల ఉచిత ప్రయాణం అమలుపై జిల్లాలోని ఉన్నతాధికారులు ఇప్పటికే తగిన కసరత్తు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో సాధారణంగా రోజుకు 30 శాతం మంది మహిళలు ప్రయాణిస్తున్నారని అంచనా. జిల్లాలోని 5 డిప్లో 371 బస్సులు ఉన్నాయి. ఇందులో ఆర్టీసీకి చెందినవి 326 కాగా 45 అద్దె బస్సులు. ఈ బస్సుల్లో జిల్లాలో రోజుకు 1.15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో సుమారు 32 వేల మంది మహిళలుంటారు. వీరందరికీ ఉచిత ప్రయాణం ఉపయోగపడనుంది. ఉచిత టికెట్టు నమోదుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్నారు. ఆధార్‌ కార్డులోని చివరి నాలుగు అంకెలను నమోదు చేసి, జీరో టికెట్‌ ఇవ్వనున్నారు. ఎక్స్‌ప్రె్‌సల్లోనూ ఉచితం వర్తిస్తుందా లేదా అనే స్పష్టత లేదు కానీ జిల్లాలో ఉన్న 221 పల్లెవెలుగు బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణం ఉంటుంది. అయితే వైసీపీ ప్రభుత్వం గతంలో

బస్సులు పెంచాలి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత, నష్టాలను తగ్గించే సాకుతో అనేక గ్రామీణ రూట్లల్లో సర్వీసులను నిలిపివేశారు. ఐదేళ్లల్లో జిల్లాలో 50 శాతం సర్వీసులు రద్దయినట్టు అంచనా. దీంతో చాలా గ్రామీణ రూట్లకు బస్సు సౌకర్యం లేక ఆటోలు, ప్రైవేటు సర్వీసుల మీద జనం ఆధారపడుతున్నారు. గతంలో 50 కొత్త బస్సులు మంజూరు అయినా వాటిని వినియోగంలోకి తీసుకురాలేదు. కొత్త ప్రభుత్వం సర్వీసులు కూడా పెంచుతుందనే ఆశ ప్రజల్లో ఉంది.

Updated Date - Jun 12 , 2024 | 07:49 AM