Share News

మద్యం స్వాధీనం..ఒకరి అరెస్టు

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:17 PM

ద్విచక్రవాహనంలో మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

మద్యం స్వాధీనం..ఒకరి అరెస్టు

సత్యవేడు, జనవరి 8: ద్విచక్రవాహనంలో మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీసిటీ ఎస్‌ఐ అరుణ్‌ కుమార్‌రెడ్డి కథనం మేరకు.. అప్పయ్యపాళెంకు చెందిన అశోక్‌ వరదయ్యపాళెం మండలం చిలమత్తూరు మద్యంషాపు నుంచి 15 మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి తరలిస్తుండగా అప్పయ్యపాళెం తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శ్రీసిటీ పరిశ్రమల్లో పనిచేసే కూలీలకు ఎక్కువ ధరకు మద్యం విక్రయించేవాడని విచారణలో తేలింది. మద్యంతోపాటు ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.

Updated Date - Jan 08 , 2024 | 11:17 PM