అటవీ సరిహద్దు గ్రామాల్లో గజదాడులు
ABN , Publish Date - May 26 , 2024 | 12:28 AM
అటవీ సరిహద్దు గ్రామాలో గజ దాడులు మళ్లీ మొదలయ్యాయి. వి.కోట మండలం బోయచిన్నాగనపల్లె గ్రామ పరిసరాల్లోని చేపలబండ ప్రాంతం నుంచి ఐదు ఏనుగులు పంటపొలాల్లోకి చొరబడ్డాయి.
25పీఎల్ఎం వికేటి1: బోయచిన్నాగనపల్లె వద్ద ఏనుగులు ధ్వంసం చేసిన మామిడి తోట
మామిడి తోటలకు అపార నష్టం
వి.కోట, మే 25: అటవీ సరిహద్దు గ్రామాలో గజ దాడులు మళ్లీ మొదలయ్యాయి. వి.కోట మండలం బోయచిన్నాగనపల్లె గ్రామ పరిసరాల్లోని చేపలబండ ప్రాంతం నుంచి ఐదు ఏనుగులు పంటపొలాల్లోకి చొరబడ్డాయి. టమోటా, బీన్స్, మామిడి, అరటి తోటల్లోకి వచ్చి పంటలను తిని, తొక్కి నాశనం చేశాయి. రాధప్పకు చెందిన టమోటా, నారాయణరెడ్డికి చెందిన మామిడి, తులసినాయుడుకు చెందిన అరటి తోటలతోపాటు మరి కొందరికి చెందిన పంటలకు అపారనష్టం కల్గించాయి. ఐదు ఏనుగుల గుంపు రెండు రోజులుగా వరుసగా పంటలపైకి వచ్చి పడుతున్నాయి. నారాయణరెడ్డికి చెందిన మామిడి తోటలోకి వచ్చిన ఏనుగులు సుమారు 70 చెట్లను తిని, తొక్కి నష్ట పరిచాయి. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష మేరకు పంట నష్టం సంభవించినట్లు బాదితులు వాపోతున్నారు.