తిరుమలేశుడి సేవలో జూనియర్ శ్రీదేవి
ABN , Publish Date - Mar 07 , 2024 | 02:17 AM
దివంగత సినీనటి శ్రీదేవి కుమార్తె, హీరోయిన్ జాన్వీకపూర్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆమె బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తన పిన్నమ్మ అయిన నటి మహేశ్వరితో కలిసి ఆలయంలోకి వెళ్లారు.
దివంగత సినీనటి శ్రీదేవి కుమార్తె, హీరోయిన్ జాన్వీకపూర్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆమె బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తన పిన్నమ్మ అయిన నటి మహేశ్వరితో కలిసి ఆలయంలోకి వెళ్లారు.ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు.జాన్వీకపూర్కు వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు.ఆలయం ముందు జాన్వీకపూర్ను చూసేందుకు యాత్రికులు ఉత్సాహం చూపారు.
-తిరుమల, ఆంధ్రజ్యోతి